విజయనగరంలో ఓ సామాన్యుడి వేదన

అప్పుడు ప్రెంచి దొరలకు అమ్ముడుబోయిన గంజాయి మొక్క
ఇప్పుడు అదే గడ్డపై సారా మొక్కగా మొలిచింది.
నరనరాన నియంతృత్వాన్ని నింపుకొని
అధికారం కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి
తన కొమ్మలను తానే నక్కుంది.
మోడుబారి కూడా మనుషుల్ని పాలించాలని
మానవావతారం ఎత్తింది.

* * *

వాడిప్పుడు తల్లి గుండెలను తన్నే మాతృద్రోహి.
పిల్లిలా మాట్లాడే అధిష్టానపు కీలుబొమ్మ.
విదేశీ రాణి భజనలు తప్ప
ప్రజల మనోగతాలను వల్లె వేయని ప్రజాస్వామ్యపు పాపి.
కుంభకోణాల్లో ప్రజల సొమ్మును
కుంభాలు కుంభాలుగా మింగిన అవినీతి కుంభకర్ణుడు.
మత్తుటేర్లు పారించిన మధ్యం మాఫియాకు మహారాజు.
సొంతాస్తులు కూడబెట్టి
సొంతవారికే పదవులు కూడగట్టుకున్న రాజ్యాగ విద్రోహి.

* * *

ఇప్పుడు ఏ అగ్ని పర్వతం బద్ధలు కాకున్నా
సామాన్యుడి నరాల్లో లావా ప్రవహిస్తోంది.
ఏ సునామీ విజృంభించకున్నా
విజయనగరుడి గుండెలు కెరటాల్లా ఎగసిపడుతున్నాయి.
ఏ భూకంపమూ భయపెట్టకున్నా
సారా కుటుంబ కుర్చీలు గజ గజా వణికిపోతున్నాయి.

* * *

కర్ఫ్యూలూ.. లాఠీ చార్జ్ లూ.. రబ్బరు బుల్లెట్లూ...
ఎన్ని కుట్రలూ.. ఎన్నెన్ని కుతంత్రాలు .. సామాన్యుడిపై..
అయినా ఏ మాత్రం ఆగని నిరసన.

ఉద్యమ కెరటాలింకా రగులుతూనే ఉన్నాయ్..
రగిలి రగిలి ఉవ్వెత్తున ఎగుస్తూనే ఉన్నాయి..
ఆంధ్రదేశాన్ని ముక్కలు చేయబోమన్నంతవరకూ
కుళ్ళు నేతల కుర్చీలు ఖాళీ అయ్యేంతవరకూ
ఇంకా ఇంకా రగులుతూనే ఉంటాయి.

* * *

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి చేతికీ
ఐదేళ్ళకోసారి తుపాకీ వస్తుంది.
ఆ తుపాకీలు చేతపట్టే సమయం ఎంతో దూరంలో లేదు.

ఓటు తూటాలతో విద్రోహుల గుండెల్ని పేల్చి
బూటుతో తన్నినట్లు ప్రాంతీయ ద్రోహులను
ఈ.వి.ఎం. మీట నొక్కి తరిమికొట్టాలి.
సమైక్యాంధ్రప్రదేశ్ ను సుస్తిరంగా నిలుపుకేనే
సమయం ఇంకా మించి పోలేదు.
జై సమైక్యాంధ్ర !








No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...